How many farmers does India really have? Or, what percent of the population does farming?

భారత దేశ జనాభాలో ఎంతమంది వ్యవసాయ రంగం పై ఆధారపడి ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ ఆర్టికల్.

Stirring the Pyramid

Yesterday, Hindustan Times published an article titled “How Many Farmers Does India Really Have?”.  This is a complex question involving definition of a farmer and the workforce of the country.  The article makes a valiant attempt to fairly present data from Census 2011 until the second last para, but ends with a wrong answer by oversimplifying the final calculation.

The article concludes:

So, if we add the number of cultivators and agricultural labourers, it would be around 263 million or 22% of the population (1.2 billion).  Then where does the common perception of 53% of population being involved in agriculture come from? It needs to be remembered that over 600 million Indians dependent on agriculture are not farmers. They are deployed in an array of related activities including fisheries.  And this confusion is widespread and innocent!

I will try to answer this question, since I pulled out half my hair trying…

అసలు టపాను చూడండి 661 more words

నోట్ల రద్దు: సేవలు, తయారీల జీడీపీ పతనం

డీమానిటైజేషన్ ప్రభావం డిసెంబర్ నెల జీడీపీ పైన కూడా తీవ్రంగా పడిందని నిక్కీ PMI సూచిక తెలియజేస్తున్నది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) తో పాటు సేవల రంగం కూడా భారీగా పతనం అయిందని నిక్కీ PMI సూచిక ద్వారా తెలుస్తున్నది. 

PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని అర్ధం. ఆర్ధిక సర్వే సంస్ధలు ఆయా ఉత్పత్తి రంగాల లోని కంపెనీల మేనేజర్లను సర్వే చేసి సదరు రంగాల ఉత్పత్తి పనితనాన్ని అంచనాల రూపంలో సేకరిస్తాయి. సర్వే వివరాల ద్వారా PMI స్ధాయిని లెక్క కడతాయి. కంపెనీలనే నేరుగా సంప్రదించి సేకరించిన వివరాలు కనుక ఈ సూచిక అంచనాలు, అధికారిక ఫలితాల ప్రకటనతో దాదాపు సరిపోలుతాయి. అందువలన ఆర్ధిక సర్వే సంస్ధల PMI లను ఆర్ధిక విశ్లేషకులు, మార్కెట్ పండితులు, ప్రభుత్వ అధికారులు విశ్వాసం లోకి తీసుకుంటారు. 

PMI సూచిక 50 పాయింట్ల వద్ద భిన్న ధోరణులను ప్రతిబింబిస్తుంది. 50 పాయింట్లకు తక్కువ నమోదు అయితే ఆ రంగంలో జీడీపీ వృద్ధి (growth) లేదా విస్తరణ (expansion) చెందడానికి బదులు కుచించుకున్నదని (contraction) అర్ధం. 50 పాయింట్లకు ఎక్కువగా PMI నమోదైతే ఆ రంగం వృద్ధి చెందిందని లేదా విస్తరించిందని అర్ధం. 

డిసెంబర్ నెలకు గాను భారత సేవల రంగం యొక్క PMI, 46.8 పాయింట్లుగా నమోదు అయిందని నిక్కీ తెలియజేసింది. నవంబర్ నెలలో సేవల రంగం PMI , 46.7 గా నమోదైందని నిక్కీ గత నెలలో తెలిపింది. అనగా నవంబర్ నెలకూ, డిసెంబర్ నెలకూ సేవల రంగం జీడీపీ లో ఏ మాత్రం తేడా లేదు. నవంబరు నెలలో వలెనె డిసెంబర్ లో కూడా సేవల రంగ జీడీపీ పతనం కానున్నది. 

భారత దేశ జీడీపీలో సేవల రంగానిదే అత్యధిక వాటా. 55 శాతం నుండి 60 శాతం వరకూ సేవల రంగం నుండే భారత జీడీపీ సమకూరుతుంది. సాఫ్ట్ వేర్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వ్యాపార సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, స్టోరేజి మొ.న రంగాలు సేవల రంగం కిందికి వస్తాయి. డీమానిటైజేషన్ వాళ్ళ హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారం కుదేలయింది. భీమా రంగంలో చెల్లింపులు, కొత్త వ్యాపారం తీవ్రంగా దెబ్బ తిన్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు ప్రజల నుండి బ్యాంకులకు చేరడమే తప్ప కొత్తగా ఫైనాన్స్ ఉత్పత్తి జరగలేదు. అనగా కొత్త రుణాల పంపిణి జరగలేదు. ప్రజల లిక్విడిటీని 86% రద్దు చేయడంతో వ్యాపారాలు నడవలేదు. ప్రయాణాలు కొన్ని వాయిదా పడ్డాయి; కొన్ని రద్దయ్యాయి. ఇవన్నీ అనివార్యంగా సేవల రంగం జీడీపీ వృద్ధిని దెబ్బ తీశాయని నిక్కీ ఇండియా సర్వీసెస్ సంస్ధ తెలిపింది. 

సేవల రంగంలోని ఉప విభాగాలు అన్నింటిలో హోటళ్లు, రెస్టారెంట్ల రంగం అత్యధికంగా కుచించుకుపోయిందని నిక్కీ తెలిపింది. సేవల రంగ కుచింపు కేవలం ఒకటి రెండు ఉప అంగాలకు పరిమితం కాలేదని, దాదాపు ఉప అంగాలన్నీ డీమానిటైజేషన్ ప్రభావానికి గురయ్యాయని కనుక ఇది తిరిగి వృద్ధి బాట పట్టడం వెంటనే జరిగేది కాదని నిక్కీ తెలిపింది. 

అనగా కొందరు ఆర్ధిక విశ్లేషకుల అంచనాలను నిక్కీ ధ్రువపరుస్తున్నది. డీమానిటైజేషన్ ప్రభావం స్వల్ప కాలం మాత్రమే ఉంటుందని, వ్యవస్ధలో నోట్ల చెలామణి పుంజుకున్న వెంటనే ఆర్ధిక వృద్ధి తిరిగి గాడిన పడుతుందని ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి జైట్లీ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు నమ్మ బలికారు. 

అయితే అరుణ్ కుమార్ లాంటి ఆర్ధికవేత్తలు వారి విశ్లేషణతో విభేదించారు. డీమానిటైజేషన్ ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ లోతులకు విస్తరించిందని, ఆర్ధిక చక్ర గమనాల గమనాన్ని ఆటంకపరిచి నిలిపివేసింది, అది తిరిగి వేగం పుంజుకోవాలంటే సమయం పడుతుందని వారు చెప్పారు. నిక్కీ కూడా అదే చెబుతున్నది. డీమానిటైజేషన్ ప్రభావం వివిధ ఉత్పత్తి రంగాల వ్యాపితంగా విస్తరించినందున, అవి తిరిగి ఉత్పత్తి సైకిల్ లో ప్రవేశించడానికి సమయం పడుతుందని నిక్కీ స్పష్టం చేసింది. ఆర్ధిక మంత్రి జైట్లీ ఈ అంశాలను పరిగణించక తప్పదు. లేనట్లయితే ఆర్ధిక వ్యవస్ధకు మరింత హాని చేసినవారవుతారు.             

సేవల రంగంతో పాటు ఫ్యాక్టరీ ఉత్పత్తి PMI సూచిక కూడా పతనాన్ని సూచిస్తున్నది నిక్కీ తెలిపింది. ఫలితంగా కీలక రంగాల ఉమ్మడి సూచిక నవంబర్ నెలతో పోల్చితే బాగా తక్కువ నమోదు చేసిందని తెలిపింది. నిక్కీ ఇండియా కాంపోజిట్ PMI ఉత్పత్తి సూచిక నవంబర్ లో 49.1 పాయింట్లు నమోదు కాగా అది డిసెంబర్ నెలలో 47.6 పాయింట్లకు పడిపోయిందని తెలిపింది. 

“మాన్యుఫాక్చరింగ్ PMI తో కూడా కలిపి చూస్తే, భారత జీడీపీ మూడవ క్వార్టర్ లో (అక్టోబర్-నవంబర్-డిసెంబర్ 2016) వృద్ధిని నమోదు చేస్తుంది గాని, అది బాగా తగ్గిపోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే సేవల ప్రొవైడర్ల వ్యాపార నమ్మకం (మోడీ తరచూ చెప్పే బిజినెస్ కాన్ఫిడెన్స్) గత 11 సంవత్సరాలలో అత్యల్ప స్ధాయికి పడిపోయింది. కాబట్టి డీమానిటైజేషన్ ప్రభావం నుండి త్వరగా కోలుకోవడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు” అని నిక్కీ PMI నివేదిక తయారు చేసిన పాలియన్నా డి లిమా చెప్పారని ద హిందూ బిజినెస్ లైన్ పత్రిక తెలిపింది. 

బ్లాక్ మని పై పోరాటం అంటూ అబద్ధాలు చెప్పి, చివరికి ‘క్యాష్ లెస్ ఎకానమీ’ అంటూ ఊదరగొడుతున్న మోడీ, జైట్లీలు తమ తుగ్లక్ చర్య ద్వారా ప్రజలకే కాకుండా భారత ఆర్ధిక వ్యవస్ధకు ఎంతటి కష్టాలు, నష్టం తెచ్చారో ఇప్పటికైనా గ్రహిస్తారా అన్నది అనుమానమే.      

అమెరికా ఎన్నికలు: స్టాక్ మార్కెట్లలో టెన్షన్!

 

45 వ అధ్యక్షుడిని లేదా అధ్యక్షురాలిని ఎన్నుకునేందుకు అమెరికా ఈ రోజు ఉద్యుక్తం అవుతున్నది. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 35 మిలియన్ల మంది ఓటు వేశారని, ఇంకా 70 మిలియన్ల ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉన్నదని పత్రికలు చెబుతున్నాయి. 65 శాతం వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్నదని అంచనా వేసినందున మరో 30-35 మిలియన్ల వరకు ఓటర్లు పోలింగ్ బూత్ లకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.

ఓటు ఫలితం కోసం అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎంత ఆందోళనతో ఎదురు చూస్తున్నారో షేర్ మార్కెట్లు కూడా అంతే ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. మార్కెట్ల ఆందోళన హిల్లరీ క్లింటన్ పైన కాకుండా డోనాల్డ్ ట్రంప్ పైన కేంద్రీకరించబడింది. వాటి భయం అంతా డోనాల్డ్ ట్రంప్ గెలుస్తాడేమో అన్నదే. ప్రపంచీకరణ విధానాల వల్ల అమెరికా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ఉద్యోగాలు విదేశాలకు తరలిపోయాయని ఆరోపించిన ట్రంప్ తాను అధికారంలోకి వస్తే ఆ విధానాలను తిరగదోడతానని హామీ ఇవ్వడం అందుకు ఒక కారణం. 

ట్రంప్ గెలుపు సాధిస్తే గనక షేర్ మార్కెట్లు  2 శాతం నుండి 6 శాతం వరకు పడిపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిల్లరీ క్లింటన్ గెలిస్తే గనుక మరో 1 లేదా 2 శాతం మార్కెట్లు లాభ పడవచ్చని భావిస్తున్నారు. క్లింటన్ ఈ-మెయిల్ సర్వర్, ఈ మెయిళ్ల లీకేజి వ్యవహారంలో రెండో సరి విచారణకు ఆదేశించిన FBI , హిల్లరీ పైన కేసు పెట్టబోవడం లేదని సోమవారం ప్రకటించడంతో మార్కెట్లు 2% పైన లాభ పడ్డాయి. క్లింటన్ గెలుపు ప్రభావాన్ని ఈ లాభం చాలా వరకు కవర్ చేసిందని కనుక హిల్లరీ వాస్తవంగా గెలిస్తే దాని ప్రభావం షేర్ మార్కెట్ పై కాస్త తగ్గుతుందని చెబుతున్నారు. 

కాగా ట్రంప్ గెలుపు పట్ల అతి పెద్ద బ్యాంకులు మోర్గాన్ స్టాన్లీ, జె పి మోర్గాన్ ఛేజ్ & కో, గోల్డ్ మెన్ సాక్స్ గ్రూప్… మొ.వి ఆందోళనతో ఉన్నాయని వాణిజ్య పత్రికలు చెబుతున్నాయి. ట్రంప్ గెలుపు బ్రెగ్జిట్ తరహాలో అతి పెద్ద కుదుపుకు కారణం అవుతుందని ఈ వాల్ స్ట్రీట్ బ్యాంకులు భావిస్తున్నాయి. దానితో అవి ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు  చేసుకుంటున్నాయి. 

భారత కాలమానం ప్రకారం ఎన్నికల ఫలితాలు బుధవారం ఉదయం నుండి వెలువడతాయని తెలుస్తున్నది. కనుక ఎన్నికల ప్రభావం మొదటి ఆసియా షేర్ మార్కెట్ల పైనే పడుతుంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు ఏర్పాట్లు చేస్తున్నాయి. 

ఆసియాలో కార్యకలాపాలు కేంద్రీకరించిన బడా ద్రవ్య బ్యాంకులు మొదటిగా ప్రభావానికి గురవుతాయి. ఈ నేపథ్యంలో జపాన్ కు చెందిన నోమురా హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్ధ బుధవారం మరింత మంది సిబ్బంది విధుల్లో ఉండేట్లుగా చూస్తున్నామని తెలిపింది. ఆసియాలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్విస్ బ్యాంకు HSBC కూడా బుధవారం అధిక సిబ్బందిని నియోగించనుంది. లండన్, హాంగ్ కాంగ్ ఆఫీసుల్లో సిబ్బందిని పెంచామని తెలిపింది. ట్రేడింగ్ కార్యకలాపాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది కనుక ఎక్కువ సిబ్బంది ఉంటే ఒత్తిడికి తగినట్లు  స్పందించగలమని ద్రవ్య కంపెనీలు భావిస్తున్నాయి. 

గత జూన్ లో బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడిన అనంతరం S&P 500 షేర్ సూచిక ఏకంగా 3.6 శాతం పతనం అయిన సంగతిని మార్కెట్లు, కంపెనీలు గుర్తు చేసుకుంటున్నాయి. 

స్టాప్-లాస్ ఆర్డర్ లను వినియోగపెట్టాలని అమెరికా బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ తన సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది. ఈ పద్ధతిలో కస్టమర్లు తమ పోర్ట్ ఫోలియోలు స్టాక్ మార్కెట్ లో పతనానికి గురయిన పక్షంలో నిర్దిష్ట స్ధాయిలో అమ్మెయ్యాలని కోరుతారు. సదరు షేర్ ఆ స్ధాయికి పడిపోయిన వెంటనే ఆటోమెటిక్ గా అమ్మకానికి పెట్టే సర్వీస్ ని అందుబాటులోకి తేవాలని మోర్గాన్ స్టాన్లీ సూచించింది. (ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు ధనిక కస్టమర్ల, సంస్ధల షేర్ పెట్టుబడులను మేనేజ్ చేస్తుంటాయి. అందుకు ఫీజు వాసులు చేస్తాయి. వారి షేర్ ల అమ్మకాలు, కొనుగోళ్ల పైన సలహాలు ఇస్తూ  ఫీజు వసూలు చేస్తాయి.) 

ఎన్నికలకు సంబంధించి పరిణామాల పట్ల కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ మోర్గాన్ స్టాన్లీ తన సిబ్బందికి సాహిత్యం కూడా పంచి పెట్టింది. దానిని చదివి సిబ్బంది తయారుగా ఉంటె కస్టమర్లకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారన్నట్లు.  ముఖ్యంగా వెల్త్ మేనేజ్ మెంట్ విభాగాలకు ఈ తరహా సాహిత్యాన్ని బ్యాంకు పంపిణి చేసినట్లు తెలుస్తున్నది. 

అమెరికా స్టాక్ ధరలు అటు గాని ఇటు గని 2 శాతం ఊగిసలాడ వచ్చని నిపుణులు భావిస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే గనక S&P 500 సూచి 3 నుండి 5 శాతం పతనం కావచ్చని మరో అతి పెద్ద వాల్ స్ట్రీట్ బ్యాంకు సిటీ బ్యాంక్ అంచనా వేస్తున్నది. హిల్లరీ గెలుపు ఫలితాన్ని ఇప్పటికే (సోమవారం) మార్కెట్లు గ్రహించినందున ఆమె గెలుపు పెద్దగా కదలిక తేకపోవచ్చుఁ. మార్కెట్లు మరోసారి లాభ పడతాయి గని అది పెద్ద మొత్తంలో ఉండకపోవచ్చు. 

హిల్లరీ అధికారంలోకి వస్తే యధాతథ స్ధితిని కొనసాగిస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి. పరాయి దేశాలపై యుద్ధాలు, రష్యాతో యుద్ధోన్మాదం తీవ్రం చేయడం, ఉక్రెయిన్, సిరియా, యెమెన్ ప్రజలను మరింత ఊచకోత కోయించడం తద్వారా యుద్ధ అమ్మకాలు స్ధిరంగా కొనసాగేలా చూసి దగ్గరి (అడ్డ) దారిలో అమెరికా వృద్ధి రేటు పెంచడం..ఇవీ హిల్లరీ నుండి మార్కెట్లు ఆశిస్తున్న యధాతథ స్ధితి. తాను అధికారంలోకి వస్తే రష్యాతో స్నేహం చేస్తానని, యుద్ధాలు నిలిపేస్తానని, శత్రు సంబంధాలు నిరాకరిస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు. ఇది వాల్ స్ట్రీట్ కంపెనీలకు ఎంత మాత్రం సమ్మతం కాదు. హిల్లరీ పై విచారణ లేదని FBI ప్రకటించాక 2 శాతం పైగా లాభాలు నమోదు చేయడం ద్వారా మార్కెట్లు ఆ విషయాన్నే చెప్పాయి. 

2008-09 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఘటనగా అమెరికా ఎన్నికలను నోమురా బ్యాంకు పేర్కొన్నది. ట్రంప్ గెలిస్తే మార్కెట్లు , ముఖ్యంగా ఆసియా ఈక్విటీలు 6% నష్టపోతాయని నోమురా అంచనా వేసింది. 

ఎన్నికల అనంతరం భారీ ట్రేడింగ్ జరగడమే గాక భారీ స్ధాయిలో హెచ్చు తగ్గులు ఉంటాయని ‘సొసైటీ జనరల్’ సంస్ధ ఆసియా పసిఫిక్ విభాగం ప్రకటించింది. కస్టమర్ల విభాగం, బ్యాక్ ఆఫీస్ విభాగం రెండింటిలో సిబ్బందిని పెంచుతామని సొసైటీ జనరల్ తెలిపింది. టెక్నాలజీ సిబ్బందిని ఎక్కువ మందిని అందుబాటులు ఉంచుతున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా షేర్ బ్రోకింగ్ కంపెనీలు కూడా ఇవే చర్యలు తీసుకుంటున్నాయి. అయితే పెద్ద మార్పులు జరుగుతాయని అవి అనుకోవడం లేదు. అనగా హిల్లరీ గెలుపు ఖాయం అని ఆస్ట్రేలియా కంపెనీలు భావిస్తున్నాట్లే!

పౌండ్: సెకన్లలో 10% పతనం

బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ శుక్రవారం లిప్తపాటు కాలంలో భారీగా పతనమై కలకలం సృష్టించింది. అనంతరం తిరిగి కోలుకున్నప్పటికీ పౌండ్ క్రాష్ తో ప్రపంచ మార్కెట్లు  ఒక్కసారిగా కలవర పడ్డాయి. 

శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం అయ్యాక ఒక దశలో పౌండ్ విలువ 1.2600 డాలర్ల వద్ద ఉన్నది. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా పతనం కావడం మొదలయింది. ఎంత వేగంగా పతనం అయిందంటే కొద్ది సెకన్ల తర్వాత చూస్తే పౌండ్ విలువ 1.1378 డాలర్లుగా తెరల పైన ప్రత్యక్షం అయింది. ఇది 10 శాతం పతనంతో సమానం. 

ఇంతకీ పౌండ్ స్టెర్లింగ్ ఎందుకు క్రాష్ అయిందో ఎవరికీ అంతుబట్టలేదు. సాంకేతిక కారణం వలన (కంప్యూటర్ లో సాఫ్ట్ వేర్ బగ్) క్రాష్ అయి ఉంటుందని కూడా ఎవరు చెప్పకపోవడం విశేషం. స్టాక్ మార్కెట్లు ముఖ్యానంగా పశ్చిమ దేశాల స్టాక్ మార్కెట్లు  కంప్యుటర్ సాఫ్ట్ వేర్ ల సహాయంతో అత్యంత వేగంగా నడుస్తుంటాయి. అందువల్ల అప్పుడప్పుడు ట్రాఫిక్ లో ఆటంకాలు తలెత్తడంతో లేదా ఇతర కారణాల వల్లనో (కంప్యుటర్ గ్లిచ్ అని వీటిని అంటూ ఉంటారు) సాధారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటి క్రాష్ కి దానిని కూడా కారణంగా చెప్పడం లేదు. 

కారణం ఏమిటో చెప్పలేదు గాని ఈ కొద్ది సెకన్ల ట్రేడింగ్ ని రద్దు చేశారని రాయిటర్స్ న్యూస్ తెలిపింది. రద్దు  చేసాక పౌండ్ విలువ 1.1491 గా నిర్ధారించారని తెలిపింది. 31 ఏళ్ళ క్రితంతో (1985) పోల్చితే ఇది కూడా అత్యల్ప స్ధాయి కావడం గమనార్హం.  

అనంతర ట్రేడింగ్ లో పౌండ్ విలువ కోలుకుని 1.2460 డాలర్లకు చేరినట్లు తెలుస్తున్నది. ఇది 1.2% తగ్గుదలకు సమానం. మార్కెట్ల రియాక్షన్ చూసేందుకు కావాలని పౌండ్ విలువను పతనం చేశారా అని కొందరు అనుమానిస్తున్నారు. అయితే దీనికి చాలా చాలా తక్కువ అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. 

ఆదివారం నాడు ధెరెసా మే బ్రెగ్జిట్ గురించిన ప్రకటన చేసిన తర్వాత మార్కెట్లు ఆందోళనలో పడ్డాయని కొందరు సూచిస్తున్నారు. మార్చి 2017 చివరి కల్లా ఆర్టికల్ 50 కింద ఈయూ కు ఎగ్జిట్ నోటీసు ఇస్తామని, బ్రిటిష్ ప్రజల తీర్పు ని శిరసా వహించ వలసిందేనని ఆమె తమ పార్టీ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు.  

“యూరోపియన్ యూనియన్ బ్రిటన్ తో గట్టిగా వ్యవహరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ ప్రధాని ధెరేసా మే యూరప్ నుండి కఠినమైన షరతులతో వెళ్లిపోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నది” అని నిన్న -గురువారం- ఫ్రెంచి అధ్యక్షుడు ఫ్రాన్షా ఒలాండే సూచించారు. ఆయన ప్రకటనను మార్కెట్లు పరిగణించినట్లు కనిపిస్తున్నదని కొందరు సూచించారు.  

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సరళతరమైన విత్త విధానం అనుసరించడం పట్ల బ్రిటిష్ ప్రధాని స్వల్పంగా విమర్శించారు. మానిటరీ పాలసీని కఠినం కావించాలని ఆమె సూచించినట్లుగా భావించి మార్కెట్లు మరింత ఆందోళనకు గురైనాయని కొందరు విశ్లేషకులు సూచించారు. 

ఈ వారంలో పౌండ్ విలువ ఇప్పటి వరకు 4% పడిపోయింది. దేశాధినేతల ప్రసంగాలు, వ్యాఖ్యలు, షేర్ మార్కెట్ల కదలికలతో పాటు కరెన్సీ విలువలను కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయో పౌండ్ స్టెర్లింగ్ విలువ పతనం తెలియజేస్తున్నది. కాగా పౌండ్ పతనం డాలర్ బలీయం కావడానికి దారి తీసి మరింత ఆశాజనకమైన భవిష్యత్తును అమెరికా ఆర్ధిక వ్యవస్ధ చూసేలా ప్రభావం కలగజేయడం దీనికంతటికి  కొసమెరుపు!

అమ్మకానికి ట్విట్టర్!

150 అక్షరాల మైక్రో బ్లాగింగ్ సామాజిక వెబ్ సైట్ అయిన ట్విట్టర్ అమ్మకానికి వచ్చింది. కంపెనీని అమ్మకానికి పెట్టిన వ్యవస్ధాపకులు తమ బేరం అమ్మకం రూపం ధరించేది లేనిది చెప్పకున్నప్పటికీ ఇంటర్నెట్ బడా కంపెనీలు ట్విట్టర్ కోసం బిడ్ లు దాఖలు చేస్తున్నాయి. 

ట్విట్టర్ కొనుగోలుకు గూగుల్ కూడా రంగం లోకి దిగిందని ఆరంభంలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆ వార్తలు వెనక్కి వెళ్లాయి. ట్విట్టర్ యజమానుల అనిర్దిష్ఠ ధోరణి గూగుల్ కంపెనీ వెనక్కి తగ్గటానికి కారణం అని తెలుస్తున్నది. 

అక్టోబర్ 27 లోపు మొత్తం అమ్మకం ప్రక్రియ పూర్తీ కావాలని ట్విట్టర్ అధినేతలు తాజాగా ప్రకటించినట్లు తెలుస్తోంది. దానితో ట్విట్టర్ అమ్మకంపై మళ్ళీ మార్కెట్ వర్గాల్లో కదలిక వచ్చింది. ట్విట్టర్ ను ఇటీవలనే అమ్మకానికి పెట్టిన నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో అమ్మకం పూర్తి కావటం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. అసాధ్యమైన టైం లైన్ ప్రకటించడం ద్వారా అమ్మకానికి సిద్ధమా లేదా అన్న అనుమానాన్ని ట్విట్టర్ మిగిల్చిందని వారు చెబుతున్నారు. 

 

కంపెనీ భవిష్యత్తు పైన వాటా దారులకు, ఉద్యోగులకు ఒక స్పష్టత ఇవ్వడం కోసమే సాధ్యమైనంత త్వరగా అమ్మకాన్ని పూర్తీ చేయాలని ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సీ భావిస్తున్నారని ట్విట్టర్ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్ఛే రెండు వారాల్లో బిడ్ లు పూర్తి చేసినట్లయితే వాటాదారులకు (షేర్ హోల్డర్లు) ఒక స్పష్టత వస్తుందని షేర్ విలువ పడిపోకుండా ఆపినట్లు అవుతుందని వారు చెబుతున్నారు. 

ఇప్పటి వరకు సేల్ ఫోర్స్ డాట్ కామ్ ఇంక్., గూగుల్ ఓనర్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్., వాల్ట్ డిస్ని లు ట్విట్టర్ అక్విజిషన్ (సొంతం) కు ఆసక్తి ప్రదర్శించాయి. ట్విట్టర్ కోసం తాము బిడ్ వేయకపోవచ్చని గూగుల్ కంపెనీ వర్గాలు చెప్పారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక సేల్ ఫోర్స్, వాల్ట్ డిస్ని లు మాత్రమే రంగంలో మిగిలి ఉన్నాయని భావించవచ్చు. 

బిడ్ ప్రక్రియ అమ్మకంగా మారుతుందన్న నమ్మకం లేకనే గూగుల్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై వ్యాఖ్యానించడానికి ట్విట్టర్ నిరాకరించింది. ట్విట్టర్ కు చెందిన సామాజిక కోణాన్ని, న్యూస్ కోణాన్ని వినియోగించుకోవడానికీ గూగుల్ ఆసక్తి చూపిందని, ఇప్పుడు బిడ్ దాఖలుకు వెనక్కి తగ్గడంతో గూగుల్ తదుపరి చర్య ఏమిటో ఎదురు చూస్తున్నామని పరిశీలకులు చెబుతున్నారు. గూగుల్ పూర్తిగా వెనక్కి తగ్గలేదని ఈ సమాచారం చెబుతోంది. ట్విటర్ కు సంబంధించిన ట్వీట్ ల డేటా బేస్, మైనింగ్ ప్రక్రియ పరిజ్ఞానం, వ్యాపార తెలివితేటలు పట్ల సేల్ ఫోర్స్ డాట్ కామ్ ఆసక్తిగా ఉన్నది. కాగా వాల్ట్ డిస్ని సంస్ధ తన స్పోర్ట్స్ మరియు ఎంటర్ టైన్మెంట్ ల కోసం ట్విట్టర్ వేదికను వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. 

అసలు అమ్మకానికి పెట్టడానికి కారణం ఏమిటి? 2013 లో ట్విట్టర్ IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ప్రకటించడం ద్వారా వాటా సంస్ధగా ఉనికిలోకి వచ్చింది. అనంతరం వార్తల ప్రసారాన్ని చేపట్టి వాటా విలువ పెంచుకోగలిగింది. కానీ ఆ తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడంలో విఫలం అవుతూ వచ్చింది. ఇతర ఇంటర్నెట్ కంపెనీలతో పాటుగా వినియోగదారుల పునాదిని విస్తరించుకోవడంలో విఫలం అవుతోంది. దానితో పూర్తిగా పుట్టి మునగక ముందే సంస్ధను అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని వ్యవస్ధాపకులు భావించారు.  

ఉదాహరణకి 2016 మొదటి, రెండవ త్రైమాసికంలలో వాల్ స్ట్రీట్ అంచనాలకు తగ్గట్లుగా వృద్ధిని ట్విట్టర్ నమోదు చేయలేకపోయింది. గత 11 త్రైమాసికాలలో లాభం (డివిడెండ్) అన్నదే నమోదు చేయలేకపోయింది. షేర్ విలువ పడిపోవడం మొదలయింది. దానితో షేర్ హోల్డర్ లలో తొక్కిడి మొదలయింది. షేర్లను వదిలించుకునే ప్రయత్నంలో పడ్డారు. 

26$ షేర్ విలువతో పబ్లిక్ సంస్ధగా మారిన ట్విట్టర్ త్వరలోనే 74$ కు చేరింది. ఆ తర్వాత అక్కడే స్ధిరపడి అనంతరం మెల్ల మెల్లగా విలువ కోల్పోతున్నది. మరోవైపు పేస్ బుక్, గూగుల్ లాంటి కంపెనీలు వరుస వృద్ధి నమోదు చేస్తూ  దూసుకెళ్తున్నాయి. దానితో అమ్మకానికి పెట్టక తప్పలేదు ట్విట్టర్ వ్యవస్ధాపక యజమానులకు. 

RBI వడ్డీ తగ్గింపు -విశ్లేషణ

రిజర్వ్ బ్యాంకు పాలసీ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనర్ధం వడ్డీ రేటు 0.25% తగ్గుతుంది అని. 6.5% గా ఉన్న రేటు ఇప్పుడు 6.25% అయింది. ఈ కోతతో పారిశ్రామిక వర్గాలు సంతోషం ప్రకటించాయి. 

అసలు కోతకు ముందే, కోత కోస్తారని ముందే ఊహిస్తూ  సెన్సెక్స్ సూచి 377 పాయింట్లు పెరిగింది. దానితో అసలు కోత జరిగాక సూచి పెద్దగా పెరగలేదు. 

తాజా వడ్డీ కోత వెనుక గమనించవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి.

మాజీ గవర్నర్ తప్పు కోవాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి చేత అదుపు లేని ఆరోపణలు చేయించారు. ఆయన వల్లే జీడీపీ పెరగడం లేదని, ఆయనకీ దేశభక్తి లేదని, అమెరికా పౌరుడని… ఇంకా ఏవేవో. ఈ ఆరోపణల లక్ష్యం రాజన్ తనంతట తానె తప్పుకునేలా చేయడం. 

ఎందుకని? ఎందుకంటే, ద్రవ్యోల్బణం పైన చూపుతో వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచుతున్నాడని రాజన్ పైన పరిశ్రమ వర్గాలు, స్వామి లాంటి నేతలు కత్తి గట్టారు. ఆయన తప్పుకోవాలని భావించారు. నేరుగా చెప్పలేక ‘పొమ్మన లేక పొగ పెట్టారు.’ 

ద్రవ్యోల్బణం పెరగడం అంటే ధరలు పెరగడం. ధరలు పెరగడం అంటే వ్యవస్ధలో ద్రవ్య చెలామణి ఎక్కువగా ఉండడం. కాబట్టి వడ్డీ రేటు పెంచి, లేదా తగ్గించకుండా కొనసాగించి అదనపు ద్రవ్యాన్ని చలామణి నుండి ఉపసంహరించడానికి RBI ప్రయత్నిస్తుంది. ఇది ఏ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినా చేసే పనే. అయినా బీజేపీ గణాలు కత్తిగట్టి, రాజన్ ని పంపించారు.  

రాజన్ పోయాక RBI – వడ్డీ కోత/పెంపు లకు సంబంధించి కొన్ని పాలనా నిర్ణయాలు, కొన్ని విధాన నిర్ణయాలలో మార్పులు తెచ్చారు. 

పాలనా నిర్ణయాలు: మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ని ఏర్పాటు చేయటం. ఇక ఇప్పుడు వడ్డీ రేటు మార్పులు గవర్నర్ ఒక్కరే కాకుండా కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ సభ్యులను కొందరిని కేంద్రం నియమిస్తుంది. తద్వారా RBI నడకని తన నియంత్రణలోకి కేంద్ర ప్రభుత్వం తెచ్చుకుంది.

వాస్తవానికి ఏ దేశంలో నైనా సెంట్రల్ బ్యాంకు -చట్టం ప్రకారం- స్వతంత్రంగా వ్యవహరించాలి. చట్టాలలో కొన్ని సవరణలు తెఛ్చి RBI స్వతంత్రతను మోడీ ప్రభుత్వం హరించివేసింది. తద్వారా మానిటరీ విధానాల్లో ప్రజల గురించి ఆలోచించి నిర్ణయాలు చేసే అవకాశాన్ని గవర్నర్ నుండి ప్రభుత్వం లాగేసుకుంది. కేంద్రం మాట వినక తప్పని పరిస్ధితిని కల్పించింది. ఇది ఆర్ధిక వ్యవస్ధకు మంచిది కాదు.

img_0386

విధాన నిర్ణయాలు: గతంలో రాజన్, ద్రవ్యోల్బణం 4 శాతంగా నిర్ణయించి దానిని సాధించడానికి 2018 సంవత్సరాన్ని గడువుగా పెట్టారు. ఇప్పుడు కమిటీ ద్వారా దీనిని 2021 కి పొడిగింపు జేశారు. మధ్య కాలిక ద్రవ్యోల్బణం లక్ష్యం 4% అనే చెబుతూ గడువుని మరో 3 ఏళ్ళు పొడిగించారు. అనగా స్వల్ప కాలిక లక్ష్యం కాస్తా మధ్య కాలిక లక్ష్యంగా మార్చారు. 

ఇందువల్ల ఏం ఒరిగింది? చాలా ఒరిగింది. ద్రవ్యోల్బణం లక్ష్యం దూరం జరిపితే వడ్డీ రేటుని తగ్గించే గడువు కూడా పెరిగింది. అనగా మరింత ఖాళి సమయం దొరికింది. గడువు దగ్గరగా ఉంటె దాన్ని సాధించాలన్న తొందరలో త్వరత్వరగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (ఆగస్టు 2016 నాటికీ) 5% ఉండగా, హోల్ సేల్ ధరల ద్రవ్యోల్బణం 5.05% (డిసెంబర్ 2015 నాటికి) ఉంది. కాబట్టి 4% లక్ష్యం చేరాలంటే వడ్డీ రేటు పెంచవలసి ఉంటుంది. 

ఎందుకని? ఎందుకంటే, ఇటీవల ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయి. ఇది నవంబర్ లో అమలులోకి రావచ్చుఁ. ఉత్పత్తి తగ్గితే ధరలు పెరుగుతాయి. మన ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రభుత్వాల పనితనం కానీ కాదు. చమురు ధరలు చారిత్రకంగా అత్యంత తక్కువగా ఉండడం వల్లనే ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నది. కాబట్టి చమురు ధరలు పెరిగితే ఇక ద్రవ్యోల్బణం పెరగడమే గాని తగ్గడం ఉండదు. కాబట్టి 2018 లోపు వడ్డీ రేటు తగ్గించే అవకాశం తక్కువగా ఉన్నది. పెంచడానికే అవకాశం కనిపిస్తున్నది తప్ప తగ్గించేందుకు కనిపించడం లేదు. 

గడువు పెంచితే లక్ష్యం సాధించేందుకు కావలసిన ఊపిరి/కాలం చిక్కుతుంది. ప్రస్తుతానికి వడ్డీ రేటు తగ్గించేసి లక్ష్యం చేరుకోవడానికి ఇంకా గడువు ఉన్నది కదా! అని తాము సంతృప్తి పడవచ్చూ, అడిగేవాడికి గట్టిగా చెప్పనూవచ్చు. 

మరో అంశం ఏమిటి అంటే రాజన్ వెళ్లే నాటికి న్యూట్రల్ రేటు 1.5% నుండి 2% వరకు ఉన్నదని అంచనా వేశారు. న్యూట్రల్ రేటు అంటే రిస్క్ లేని రేటు కి ద్రవ్యోల్బణ రేటుకి మధ్య ఉండే తేడా. సులువుగా చెప్పాలంటే ఒక దేశంలో ద్రవ్యోల్బణం స్ధిరంగా ఉన్నదని భావిస్తూ  ఆర్ధిక వ్యవస్ధ వాస్తవంగా ఎంత శాతం వృద్ధి అవుతున్నదో అంచనా వేస్తె అదే న్యూట్రల్ రేటు. రాజన్ ఉన్నప్పుడు భారత ఆర్ధిక వ్యవస్ధ వాస్తవ అర్ధంలో (ద్రవ్యోల్బణం ప్రభావం తీసి వేస్తె) 1.5% నుండి 2% వరకు పెరుగుతోందని అంచనా వేయగా ఇప్పుడు ఆ అంచనాని 1.25% కి తగ్గించుకున్నారు. అనగా వృద్ధి రేటు అనుకున్నంతగా లేదని మోడీ ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ అంచనా వేస్తున్నాయన్నమాట!

కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ హయాంలో ఇది మొట్టమొదటి విత్త విధాన సమీక్ష. అధికారాలు పరోక్షంగా కత్తిరించబడిన రిజర్వ్ బ్యాంకుకు ఆయన ఇప్పుడు రాజు. ఆయన విత్త పాలన అనివార్యంగా కేంద్రం చెప్పు చేతల్లో ఉండబోతున్నదని, ఆర్ధిక మంత్రి – ఆర్బీఐ గవర్నర్ల మధ్య తగువులాట, అలకలు ఇక పెద్దగా ఉండకపోవచ్చని ఈ సమీక్ష చెబుతున్నది.

31 ఏళ్ళ స్ధాయికి పడిపోయిన బ్రిటన్ కరెన్సీ

బ్రెగ్జిట్ విషయమై సోమవారం నాడు బ్రిటిష్ ప్రధాని చేసిన ప్రకటన ప్రభావం చూపిస్తోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ కు స్పష్టమైన టైం టేబుల్ ను ఆమె ప్రకటించడంతో బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 31 ఏళ్ళ కనిష్ట స్ధాయికి పడిపోయింది. దానితో బ్రిటిష్ ఎగుమతులు పెరుగుతాయన్న అంచనాతో బ్రిటిష్ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచి FTSE 16 నెలల గరిష్ట స్ధాయికి పెరిగింది. 

అధికార కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రధాని ధెరిసా మే ‘బ్రెగ్జిట్ ప్రక్రియ మార్చి 2017 చివర్లో ప్రారంభం అవుతుంది. ఆ నెలలో ఆర్టికల్ 50 కింద ఈయూ కు నోటీసు ఇస్తాను’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనతో బ్రెగ్జిట్ తీర్పు అమలు కావటం ఖాయమే అని మార్కెట్లు నిర్ధారించుకుని తదనుగుణంగా స్పందించాయి. బ్రెగ్జిట్, దీర్ఘ కాలికంగా బ్రిటన్ కు లాభకరమే అయినప్పటికీ స్వల్ప కాలికంగా కొన్ని ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కారణం వల్లనే బ్రిటిష్ కరెన్సీ పతనం అయింది. 

అమెరికన్ డాలర్ తో పోల్చితే పౌండ్ స్టెర్లింగ్ విలువ 1.2757 డాలర్లకు పడిపోయిందని పత్రికలు తెలిపాయి. 1985 నుండి ఇదే అత్యల్ప విలువ అని తెలుస్తున్నది. యూరోతో పీల్చితే పౌండ్ స్టెర్లింగ్ విలువ 3 సంవత్సరాల కనిష్ట స్ధాయికి (87.56 పెన్నీలు) పడిపోయింది. 

“బ్రెగ్జిట్ దిశలో పటిష్టమైన టైం టేబుల్ ప్రకటించినందున స్టెర్లింగ్ కు ఇటీవల తగిలిన గాయాలకు కట్టు కట్టడం కష్టతరం అయినట్లు  కనిపిస్తున్నది” అని స్ప్రెడ్ ఎక్స్ ట్రేడింగ్ సంస్ధ నిపుణుడు -పౌండ్ పతనాన్ని ఉద్దేశిస్తూ- వ్యాఖ్యానించాడు. 

ఒక దేశ కరెన్సీ పతనం అయితే ఆ దేశంలో తయారయ్యే సరుకుల ధరలు పడిపోతాయి. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ లో ఆ సరుకులకు గిరాకీ పెరుగుతుంది. అనగా బ్రిటిష్ సరుకుల ఎగుమతులు పెరుగుతాయి. అందుకే FTSE 100 షేర్ సూచీలో లిస్ట్ అయిన బ్రిటిష్ బహుళజాతి కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. ఫలితంగా షేర్ సూచి కూడా పెరుగుదల నమోదు చేసింది. 

గత 16 నెలల్లో మొదటిసారిగా FTSE 100 సూచి 7000 మార్కును దాటింది. సోమవారంతో పోల్చితే 1.1 శాతం పెరిగి 7060 పాయింట్లకు అది చేరింది.